ఈ మధ్య కాలంలో నటీనటుల మధ్య లవ్ ట్రాక్స్, ఎఫైర్స్, సహజీవనం వంటివి సర్వసాధారణం అయిపోయాయి.ఇది వరకులా కాకుండా లివింగ్ రిలేషన్ షిప్ అనేది ఇండియాలో కూడా కామన్ అయ్యింది.
ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో మాత్రమే ఇలాంటి పదాలు వినిపించేవి.కానీ ఇప్పుడు అలా కాదు.
మన ఇండియాలో కూడా సెలెబ్రిటీలు ఈ లివింగ్ రిలేషన్ షిప్ ను తీసుకు వచ్చారు.
ఎవరైనా జంట లవ్ లో ఉండి సహజీవనం చేసి నచ్చితే పెళ్లి చేసుకుంటున్నారు.
లేకపోతే అంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నారు.ఇలాంటి వార్తలు మనం ప్రతీ నిత్యం వింటూనే ఉన్నాం.
అందుకే సాధారణ ప్రజలకు కూడా ఇలాంటి న్యూస్ లు కామన్ అయిపోయాయి.అయితే తాజాగా ఒక హీరోయిన్ కూడా తాను సహజీవనం చేసానని.
కానీ సహజీవనం చేసి మోసపోయాను అని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
మరి ఆ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.
ఆమె మరెవరో కాదు.ఆండ్రియా జెరేమియా.

ఈమె మంచి నటి మాత్రమే కాదు.సింగర్ కూడా.కోలీవుడ్ లో వరుస సినిమాలు చేసి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె తెలుగులో కూడా సినిమాలు చేసింది.
తడాకా సినిమాలో సునీల్ సరసన నటించి మెప్పించింది.ఇక తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ ఇంటర్వ్యూలో ఈమె చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.

తన కీవితంలో జరిగిన అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.”నేను గతంలో ఒక వ్యక్తితో సహజీవనం చేశాను.కానీ చాలా దారుణంగా మోసపోయాను.
నాకు 20 ఏళ్ల వయసులోనే ఈ అనుభవం ఎదురైంది అని.ఆ తర్వాత నేను ఎవరిని ప్రేమించలేదు.నాకు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు.అని తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ షేర్ చేసుకుంది.ప్రెజెంట్ ఈమె పిశాచి ఏ సినిమాలో కీలక రోల్ లో నటిస్తుంది.ఈ సినిమాలో ఈమె కొన్ని సీన్స్ లో నగ్నంగా కూడా చేసింది.
కథ డిమాండ్ చేయడం వల్లనే చేసానని ఈమె చెప్పుకొస్తుంది.







