Chandrababu Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ కామెంట్స్..!!

కర్నూలు పర్యటనలో వచ్చే ఎన్నికల్లో తనకి చివరి ఎన్నికలని చంద్రబాబు కామెంట్లు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.“బాదుడే బాదుడు” కార్యక్రమంలో భాగంగా… కర్నూలులో పర్యటిస్తూ నిన్న రాత్రి మాట్లాడుతూ.వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తనకి అవకాశం ఇవ్వాలని.రాష్ట్రాన్ని కాపాడాలని చంద్రబాబు తెలియజేశారు.2024 ఎన్నికలు తనకి చివరి ఎన్నికలని కీలక వ్యాఖ్యలు చేశారు.దీంతో  చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు.2019 ఎన్నికలే చంద్రబాబుకి చివరి ఎన్నికలు అని కౌంటర్ ఇచ్చారు.2014లో ప్రజలు చంద్రబాబుకి అవకాశం ఇస్తే ఉపయోగించుకోలేదు.పూర్తిగా విఫలమయ్యారు.

 Sajjala Ramakrishna Reddy's Serious Comments On Chandrababu , Sajjala Ramakrish-TeluguStop.com

అందువల్లే అంత పెద్ద పార్టీ పైగా పెద్ద లీడర్ అయినా గాని 23 స్థానాలకు ప్రజలు పరిమితం చేశారు.2024 పై చంద్రబాబుది “దింపుడు కళ్ళెం ఆశ” మాత్రమే అని వ్యాఖ్యానించారు.రాజకీయాల కోసం కుటుంబ సభ్యులను కూడా వాడుకుంటున్నారని విమర్శించారు.

నాయకుడిగా చంద్రబాబు విఫలమయ్యారని… అందువల్లే కుటుంబ సభ్యుల గురించి ప్రజల మధ్య ప్రస్తావిస్తూ…సానుభూతి సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube