బాలీవుడ్ బ్యూటీ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కంగానా తరచూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
సమాజంలో జరిగే పలు విషయాల పట్ల స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్ గా కూడా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా కూడా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది.
కంగానా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ గా ఎదిగింది కంగానా.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఓ స్టోరీని షేర్ చేసింది.
అందులో.ఇన్స్టాగ్రామ్ చిత్రాలకు మాత్రమే సంబంధించినది.
ఎవరైనా ఏ అభిప్రాయం రాసినా మరుసటి రోజు అదృశ్యమవుతుంది.అందరూ చంచలమైన, పనికిమాలిన మూర్ఖులలాగే, ఇక్కడు ఎవరూ ఇంతకుముందు రాసిన వాటిని చూడటానికి ఇష్టపడరు.
ఎందుకంటే వారు చెప్పేది వారికే అర్థం కాదు.అందుకే అది కచ్చితంగా అదృశ్యమవ్వాలి.
అయితే మరి కొందరి సంగతి వేరు.వారు చెప్పే ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు.

మనుషుల కోసం వారి ఆలోచనలను డాక్యుమెంట్ చేయాలి అనుకుంటున్నారు.వాటిని లోతుగా పరిశోధించడానికి ప్రయత్నిస్తారు.ఇవి మినీ బ్లాగులు.ఇవి సబ్జెక్ట్తో పాటు ఇతరులు ఉపయోగపడేలా ఉండాలి అని రాసుకొచ్చింది.ఈ ఇంస్టాగ్రామ్ వాటికి తప్ప వీనికి పనికిరాదు అంటూ కామెంట్స్ చేసింది కంగానా.ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈమెపై ఎంత మంది ఎన్ని విధాలుగా ట్రోల్లింగ్ చేసినా కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది.








