ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారుల అపహరణకు విఫలయత్నం జరగడం కలకలం సృష్టించింది.పిల్లలను ఎత్తుకువెళ్తున్న ఓ మహిళను రోగుల బంధువులు పట్టుకున్నారు.
ప్రసూతి వార్డులో పసికందును ఎత్తుకెళ్లిపోతుండగా గుర్తించారు.నకిలీ గుర్తింపు కార్డుతో సదరు మహిళ ఆస్పత్రిలో తిరుగుతోందని తెలుస్తోంది.
విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతోంది.అనంతరం మహిళను ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.