ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల అపహరణకు విఫలయత్నం..!

ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారుల అపహరణకు విఫలయత్నం జరగడం కలకలం సృష్టించింది.

పిల్లలను ఎత్తుకువెళ్తున్న ఓ మహిళను రోగుల బంధువులు పట్టుకున్నారు.ప్రసూతి వార్డులో పసికందును ఎత్తుకెళ్లిపోతుండగా గుర్తించారు.

నకిలీ గుర్తింపు కార్డుతో సదరు మహిళ ఆస్పత్రిలో తిరుగుతోందని తెలుస్తోంది.విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతోంది.

అనంతరం మహిళను ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.

అఫైర్ పెట్టుకున్న భార్యను సీక్రెట్ కెమెరాతోనే పట్టుకున్న భర్త.. కానీ కోర్టులో షాక్..?