జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖకు వెళ్లనున్నారు.సాయంత్రానికి విశాఖకు చేరుకోనున్న ఆయన రాత్రి 8.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.దాదాపు 15 నిమిషాల పాటు ప్రధానితో పవన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది.
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులు, రూట్ మ్యాప్, స్టీల్ ప్లాంట్ పై చర్చించే అవకాశం ఉందని సమాచారం.కాగా ప్రధాని పర్యటన సందర్భంగా విశాఖలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.







