యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది.యాదగిరి గుట్ట మండలం బాహుపేట దగ్గర రైలు కిందపడి బలవన్మరణం చెందారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతులు భువనగిరి మండలం బస్వాపురం వాసులుగా గుర్తించారు.







