యంగ్ రెబల్ స్టార్ గా మన టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు డార్లింగ్ ప్రభాస్.ఇక బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.
ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా మాత్రమే తెరకెక్కుతున్నాయి.అయితే మొదటిసారి ప్రభాస్ నటిస్తున్న ఒక సినిమా మాత్రం పాన్ వరల్డ్ గా తెరకెక్కుతుంది.
ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఉంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.మరి పాన్ వరల్డ్ సినిమా అంటే కంటెంట్ కూడా అదే లెవల్ లో ఉండాలి.
కానీ ఇప్పటి వరకు మాత్రం ఈ సినిమా కంటెంట్ గురించి నాగ్ అశ్విన్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.అందుకే ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు.
అయితే ప్రభాస్ పుట్టిన రోజుకు పెద్ద అప్డేట్ ఇస్తాడు అని ఎదురు చుసిన ప్రేక్షకులకు నిరాశనే ఎదురైంది.జస్ట్ ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసాడు.అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ బటయకు వచ్చింది.

ఈ సినిమా నుండి అతి త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది అని తాజాగా వినిపిస్తున్న బజ్.ఆల్రెడీ చిత్ర నిర్మాత అశ్వనీ దత్ రిలీజ్ పై మాట్లాడారు.ఇక ఇప్పుడు ఈ సినిమా యూనిట్ నుండి రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని టాక్.
ఇప్పటికే 50 శాతానికి పైగానే ఈ సినిమా షూట్ పూర్తి చేసుకుంది.ఇక వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, మరొక బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తున్నారు.







