గుంటూరు నగరంలోని నార్త్ ప్యారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.చర్చిలో ప్రార్థన చేసే అధికారం తమకే ఉందంటూ పరదేశి బాబు, శ్యామ్ సంపత్ వర్గాల పాస్టర్లు ఘర్షణకు దిగారు.
పరస్పరం కుర్చీలు విసురుకోగా, పలువురికి గాయాలయ్యాయి.పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
నార్త్ ప్యారిస్ చర్చి వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు.