మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై వినాయకుని బొమ్మలు , లక్ష్మిదేవి బొమ్మలు , రాముడి బొమ్మలు ముద్రించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విఙ్ఞప్తి చేసాడు.అది ఆయన కున్న అజ్ఞానాన్ని తెలియచేస్తుంది .
ఒక వైపు ప్రపంచమానవుడు ఇతరగ్రహాలలో కాపురం పెట్టేందుకు ఉరకలేస్తుంటే , ఇక్కడమనం ఊహాజనితమైన , కల్పితమైన పురాణాలలొ పేర్కొన్న వారి బొమ్మలను వెయ్యమని , ఒకరకమయిన ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం సరికాదు .కరెన్సీ నోట్లపైనే కాదు ప్రతిపేదవాడి గుడిసెల్లో ముఖ్యమంత్రి కెజ్రి వాల్ చెప్పిన లక్శ్మి , వినాయకుని బొమ్మలు , రాముని బొమ్మలు ఉన్నాయి .మరి వారి జీవితంలొ ఏరకమైన మార్పు వచ్చిందో చెప్పాలి.సమాజాన్ని మార్చిన శాస్త్రవేత్తల బొమ్మలు పెట్టుకుంటే వారి స్ఫూర్తి గుర్తుకొచ్చి , వారి అలోచనలకు మార్గదర్శకులుగా తయారు కావచ్చు.

అసలు ప్రభుత్వం ముద్రించే కాగితం తయారు చేసిన వారుఎవరో , ముద్రణా యంత్రాన్ని కనిపెట్టింది ఎవరో ఈప్రధానికి, ఈ కేజ్రి వాలాకు తెలుసా ! మూఢ నమ్మకాలను నిర్ములిస్తేనే సమాజం బాగుపడుతుందని ఎలుగెత్తి చాటిన చార్వాకుల బొమ్మలు ముద్రించినా ప్రజలలో చైతన్యం వచ్చేందుకు అవకాశముంది.పురోహితవర్గాన్ని , యజ్ఞయాగాలను , ముహూర్తాలను ఉతికి ఆరేసిన “వేమన “ , ప్రపంచమంతా తిరిగి బాబాల మహిమలను తనముందు ప్రదర్శించమని సవాల్ చేసిన డాక్టరు .కోవూర్ లాంటివారి బొమ్మలు , పెరియార్ రామస్వామి లాంటివారి బొమ్మలు , త్రిపురనేని రామస్వామి లాంటి వారి బొమ్మలు , పూలె , అంబెడ్కర్ లాంటి వారి బొమ్మలు , పెట్టాలి.ప్రపంచములో మొదటిసారిగా ముద్రణా యంత్రాన్ని కనిపెట్టిన గుటన్ బర్గ్ బొమ్మని కరెన్సీ నోట్లపై ముంద్రించాలి.
అలాగె కొన్ని నోట్లపై ఇతర శాస్త్రవేత్తలపేర్లు , సామాజిక శాస్త్రవేత్తల పేర్లూ ముంద్రించాలి.అంతేకాని లక్శ్మి , వినాయకుడు , రాముడు , కృష్ణుడు లాంటి ఊహాజనితమైన , కట్టుకధలలో ఉన్నవారి పేర్లను పెట్టవద్దు.
సమాజం ఇప్పటికే ఎంతో వెనక్కి పోయింది .ఇంకా వెనక్కి తీసుక పోవద్దు.







