తమిళనాడులోని కోయంబత్తూర్ కారు పేలుడు కేసులో అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఈ కేసుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అదేవిధంగా కేసును చెన్నైలోని పూందమల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు.నిందితుడు మొబిన్ నివాసంలో పోలీసులు మరోసారి సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో పేలుడు పదార్థాలు, 109 వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.ఈనెల 23న కారు బాంబు పేలిన ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తునకు రికమెండ్ చేస్తూ సీఎం స్టాలిన్ లేఖ రాసారు.కేసు దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేయాలని, కోయంబత్తూర్లో కావాల్సిన భద్రతా ఏర్పాట్లను కొనసాగించాలని లేఖలో కోరారు.







