హైదరాబాద్ సికింద్రాబాద్ లో సిలిండర్ బ్లాస్ట్ అయింది.దూద్ బావిలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది.
పేలుడు తీవ్రతకు నాలుగు ఇళ్ల గోడలు ధ్వంసం అయ్యాయి.ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.
మరో తొమ్మిది మందికి గాయాలు అయ్యాయి.వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.భవనాల శిథిలాల కింద క్షతగాత్రులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.