డీఏవీ స్కూల్ ఘటన మరువక ముందే మరో దారుణం

హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటనను మరువక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.నేరేడ్ మెట్ జేజేనగర్ గ్రేస్ అనాథాశ్రమంలో బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది.

 Another Atrocity Before The Dav School Incident Is Forgotten-TeluguStop.com

ఈనెల 19 నుంచి ఆశ్రమంలోని నలుగురు బాలికలు కనిపించకుండా పోయారు.ఆశ్రమం నుంచి బాలికలు పారిపోయినట్లు సమాచారం.

వీరిలో ఒకరు మేజర్ కాగా.ముగ్గురు మైనర్ బాలికలు.

ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టిన నేరేడ్ మెట్ పోలీసులు ఇద్దరిని సికింద్రాబాద్ లో మిగతా వారిని బంధువుల ఇళ్లలో గుర్తించారు.అనంతరం వారిని పోలీసులు సఖి సెంటర్ కు తరలించారు.

ఈ నేపథ్యంలోనే తనపై అకౌంటెంట్ మురళి లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ మైనర్ బాలిక తెలిపింది.బాలిక ఫిర్యాదుతో మురళితో పాటు ఆశ్రమ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube