చిరంజీవి బాలయ్య సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి అంతాఇంతా కాదు.చిరంజీవి, బాలయ్య మాస్ హీరోలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.ఈ ఇద్దరు హీరోల సినిమాలలో ఎవరి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయనే విషయం తెలిసిందే.2001 సంవత్సరంలో చిరంజీవి నటించిన మృగరాజు, బాలయ్య నటించిన నరసింహనాయుడు సినిమాలు సంక్రాంతి పండుగ కానుకగా విడుదలయ్యాయి.
ఈ రెండు సినిమాలలో సిమ్రాన్ మెయిన్ హీరోయిన్ గా నటించడం గమనార్హం.అయితే చాలా సంవత్సరాల తర్వాత ఇదే ఫీట్ రిపీట్ అయింది.వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య హీరో కాగా శృతి హాసన్ హీరోయిన్ రోల్ లో నటిస్తున్నారు.వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా శృతి హాసన్ హీరోయిన్ కావడం గమనార్హం.
ఈ రెండు సినిమాలు సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్నాయి.
![Telugu Balakrishna, Shruti Haasan, Simran, Sruthi Hassan, Tollyuwood, Walter Vee Telugu Balakrishna, Shruti Haasan, Simran, Sruthi Hassan, Tollyuwood, Walter Vee](https://telugustop.com/wp-content/uploads/2022/10/tollyuwood-shruti-haasan-balakrishna.jpg )
ఈ రెండు సినిమాలు కేవలం 24 గంటల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.రెండు సినిమాల ప్రమోషన్స్ శృతిహాసన్ ఒకే సమయంలో పాల్గొనాల్సి ఉంటుంది.అయితే శృతి హాసన్ ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో చూడాల్సి ఉంది.
ఈ రెండు సినిమాలలో శృతి హాసన్ రోల్స్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.శృతి హాసన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2.5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి శృతి హాసన్ ఓకే చెబుతున్నారు.
శృతి హాసన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.శృతి హాసన్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తుండగా ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు.