2019 నవంబర్ నెలలో చైనాలో బయటపడిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకి కంటిమీద కునుకు లేకుండా చేసిన సంగతి తెలిసిందే.ఈ మహమ్మారి కారణంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నబిన్నం అయిపోయాయి.
చాలామంది తమ బంధువులను తోబుట్టువులను కూడా కోల్పోయారు.ఇండియాలో సెకండ్ వేవ్ కారణంగా చాలామంది మరణించడం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో దీపావళి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వినూత్నంగా తన నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
మేటర్ లోకి వెళ్తే రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలతో కలసి జరుపుకున్నారు.అనంతరం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
అంతేకాకుండా వాళ్లకి ప్రత్యేకమైన వంటకాలు కూడా తయారు చేయడం జరిగింది.ఆటపాటలు అంత ముగించుకున్నాక అనాధ పిల్లలతో కలిసి ముఖ్యమంత్రి లంచ్ కూడా చేయటం విశేషం.
అంతేకాకుండా ఆ పిల్లలను చూసుకుంటున్న గార్డియన్స్ తో కూడా సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు.పిల్లల గురుంచి అని విషయాలు అడిగి తెలుసుకున్నారు.







