చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం వనమాల పేట టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.తమిళనాడు నుంచి మూడు వాహనాల్లో వచ్చిన న్యాయవాదులు టోల్గేట్ సిబ్బందితో గొడవకు దిగారు.
టోల్ ఫీజ్ చెల్లించే విషయంలో వివాదం చెలరేగినట్లుగా తెలుస్తోంది.దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు .టోల్ ప్లాజా వద్దకు చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు.దీంతో పరిస్థితి సద్దుమణిగింది.







