వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈనెల 21న ఆమె హస్తినకు వెళ్లనున్నట్లు సమాచారం.
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వంపై సీబీఐకి ఆమె ఇప్పటికే ఫిర్యాదు చేశారు.ఇదే విషయంపై షర్మిల మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ఈ సారి ఈడీ అధికారులకు లేదా జలశక్తి శాఖకు ఈ విషయంపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.







