కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రం కాంతార.సెప్టెంబర్ 3వ తేదీ కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీ తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇకపోతే ఈ సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగు హక్కులను కొనుగోలు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీ విడుదల కాగా మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది.కన్నడ సినిమా తెలుగు హక్కులను అల్లు అరవింద్ కేవలం రెండు కోట్ల రూపాయలకే కొనుగోలు చేశారు అయితే ఈ సినిమా మూడు రోజులలో భారీ లాభాలను అందుకుందని తెలుస్తుంది.ఈ సినిమా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మూడు రోజులకు గాను ఏకంగా 6.80 కోట్ల రూపాయల షేర్స్ రాబట్టింది అలాగే 13.5 కోట్ల గ్రాస్ రాబట్టింది.ఇలా రెండు కోట్లకు కొనుగోలు చేయగా ఈ సినిమా ఏకంగా నాలుగు కోట్ల రూపాయల లాభాలను తీసుకువచ్చింది.ఈ విధంగా మూడు రోజులకే నాలుగు కోట్ల లాభం అంటే మామూలు విషయం కాదు.

ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసిన ఈ సినిమా హవా కొనసాగుతోంది.ఇక ఈ సినిమా ముగిసేనాటికి ఎంతో సులభంగా పది నుంచి 15 కోట్ల వరకు లాభాలను రాబడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.ఏది ఏమైనా అల్లు అరవింద్ మాత్రం అత్యంత తక్కువ ధరలకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసి భారీగా లాభాలను పొందుతున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమా తెలుగులో విడుదల చేయడంతో ఈ సినిమా ప్రభావం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాపై పడిందని చెప్పాలి.







