టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమని, స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది.
ఇకపోతే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఆమని ప్రస్తుతం తల్లి అత్త పాత్రలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.ఇకపోతే దివంగత హీరోయిన్ నటి సౌందర్య కు ఆమని బెస్ట్ ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే.
ఆమనీ,సౌందర్య కలిసి ఎన్నో సినిమాలలో నటించారు.సౌందర్య చనిపోయినప్పుడు ఆమని గుండె ముక్కలు అయిందట.
సౌందర్య లేని లోటు ఎవరు తీర్చలేరని, ఆమె స్థానంలో ఎవరు రాలేదని ఆమెని పలు సందర్భాలలో చెబుతూ వచ్చింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వీరు సౌందర్య చనిపోయినప్పుడు తన మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంది అన్నది చెప్పుకొచ్చింది ఆమని.ఈ సందర్భంగా ఆమెని మాట్లాడుతూ.
సౌందర్య చనిపోయింది అన్న మాట విన్నప్పుడు నాకేమీ తెలియలేదు.అప్పుడు దేవుడిని ఎంతో తిట్టుకున్నాను.
ఆమె స్థానంలో నేను చనిపోయిన బాగుండేది దేవుడా.ఎందుకు ఇలా చేశావు అనిఎన్నోసార్లు అనుకున్నాను.
ఆ సమయానికి పెళ్లయి నాకు ఏడాది.పిల్లలు లేరు.
జీవితం మొత్తం చూసేసాను.నేను చనిపోయిన బాధ ఉండేది కాదు అని ఆమని తన మైండ్లో అనుకున్నట్టుగా చెప్పుకొచ్చింది.

అయితే సౌందర్య చనిపోయాక ఆమె సౌందర్య తల్లిని కలిసిందట.సౌందర్యకు పెళ్లి కాకముందే ఆమె అన్నయ్య అమర్ ను పెళ్లి పెళ్లి చేసుకుంటావా అని సౌందర్య తల్లి ఆమని ని అడిగిందట.కానీ ఆ సమయంలో ఆమె నీకు కెరియర్ మీద తప్ప పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిందట ఆమని.ఒకవేళ సౌందర్య తల్లి అడిగినట్లుగా అమర్ నీ పెళ్లి చేసుకుని ఉంటే, సౌందర్య తో పాటు నేను వస్తాను అని ఫ్లైట్ ఎక్కేదాన్ని.
లేదంటే భర్త బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు చనిపోయారు అంటూ వారి జ్ఞాపకాలు ఏడుస్తూ ఉండే దాన్ని అని చెప్పుకొచ్చింది ఆమని.







