తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర ఆరోపణలు చేశారు.ఆ పార్టీ భారత మ్యాప్ను మార్చిందని విమర్శించారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరును మ్యాప్ నుంచి తీసేసారని మండిపడ్డారు.సాధించి తెచ్చుకున్న రాష్ట్రంలోనే ఏం చేయలేని కేసీఆర్.
జాతీయ రాజకీయాల్లో ఎప్పటికీ రాణించలేరని ఎంపీ ఆరోపించారు.మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటీ ఉంటుందన్న ఆయన కాషాయ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.