సింహాలు, పులుల వంటి కౄర జంతువులు వాటి సహజ ఆవాసాలలో ఉంటాయి.పిల్లి, కుక్కల లాగా వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకోవడం చాలా కష్టం.
అవి బందీలుగా ఒకే ఇంట్లో ఉండలేవు.అలాగే ఇవి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో కూడా చెప్పలేం.
ఒక్కోసారి అవి యజమానులపై దాడి చేసి వారి మరణానికి కూడా కారణమవుతుంటాయి.దాని సహజ ప్రవృత్తి లేదా మృగ స్వభావం ఎప్పుడో ఒకప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది.ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
@basit_ayan_2748 అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఒక వీడియో క్లిప్లో ఒక వ్యక్తి, రెండు సింహం పిల్లలను మచ్చిక చేసుకోవాలని అనుకొన్నాడు.ఈ వీడియోలో సింహం పిల్లలు కారు వెనక భాగంలో కూర్చొని ఉండగా, సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తి తన చేతులతో వాటిని దువ్వుతూ కనిపించాడు.అయితే, కొన్ని సెకన్ల తరువాత ఈ పిల్లలు దూకుడుగా ప్రవర్తించాయి.
దాంతో బాగా భయపడిపోయిన ఆ వ్యక్తి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు.క్షణాల తర్వాత, ఆ వ్యక్తి మళ్లీ సింహాన్ని పట్టుకోవడానికి ముందుకు వెళ్లాడు.
అయితే అది కారు పైకప్పుపైకి ఎక్కింది.
ఈ క్లిప్ కొద్దిరోజుల క్రితమే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా దీనికి ఇప్పటికే 2,75,000 కంటే ఎక్కువ లైక్స్, మూడు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఇవి చిన్న పిల్లలు అయినా సరే ఆట బొమ్మలు కాదు.
వీటి తో పెట్టుకుంటే ఏదో ఒక పెద్ద గాయమే అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.
అసలు వీటిని పెంచుకోవాల్సిన అవసరం ఏంటి? వీటి మాంసం పెట్టడం కూడా చాలా పెద్ద తలనొప్పి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.