లోన్ యాప్ ల నిర్వాహకుల బెదిరింపులతో ఏపీలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.లోన్ తీసుకుని చెల్లించికపోతే, వారి ఫోన్ లోని కాంటాక్టు లిస్టులో ఉన్నవారందరికీ సందేశాలు పంపడం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం వంటి బెదిరింపులతో మనస్తాపానికి గురై బలవన్మరణం చెందారు.
దీనిపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం.లోన్ యాప్ లపై ఫిర్యాదుల కోసం కొత్తగా టోల్ ఫ్రీ నెంబరు తీసుకువచ్చింది.
లోన్ యాప్స్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.బ్యాంకు ఖాతాల వివరాలు, పిన్ నెంబరు, ఆధార్, ఓటీపీ వివరాలను, ఫొటోలను తెలియని వ్యక్తులకు ఇవ్వొద్దని సూచించింది.
ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.







