మునుగోడు ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో అభ్యర్థి పేరును ప్రకటిస్తామని అన్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు.మూడు ప్రధాన పార్టీలు ఒకే సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చాయని, బీసీలకు ఇస్తే గట్టిపోటీ ఇస్తామని నేతలు చెప్పగా, చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.







