మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది.
మునుగోడు ప్రచారానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.ఈనెల 15న కుటుంబ సభ్యులతో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారని సమాచారం.
ఇప్పటివరకు మునుగోడులో అడుగుపెట్టని సిట్టింగ్ ఎంపీగా వెంకట్ రెడ్డి నిలిచారు.అంతేకాకుండా మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ తర్వాతే హైదరాబాద్ తిరిగి వస్తారనే వాదనలు కూాడా వినిపిస్తున్నాయి.
అయితే, గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.