సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలోని ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారు.
అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందంటూ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.మరోవైపు ములాయం సింగ్ క్షేమంగా తిరిగి వస్తారని, ఆస్పత్రిలో ఆయనను కలిసేందుకు ఎవరూ రావొద్దని కుటుంబ సభ్యులు సూచించారు.
అయితే, సుమారు మూడు సంవత్సరాలుగా ఆయన ములాయం సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే గత ఆగస్ట్ నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.







