ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలు నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు కీర్తి సురేష్.తాజాగా ఈమె సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ తన తదుపరి షూటింగులతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే కీర్తి సురేష్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ తాను కొత్త కారు కొనుగోలు చేసిన విషయాన్ని తెలియజేశారు.
విజయదశమి పండుగ సందర్భంగా కీర్తి సురేష్ కొత్త కారును కొనుగోలు చేశారు.అయితే ఈమె బీఎండబ్ల్యూ X7 సిరీస్ కు చెందిన కారును కొనుగోలు చేశారని తెలుస్తుంది.ఈ కారు ధర సుమారు 1.20 కోట్లు ఉంటుందని అంచనా.ఇక ఈ కారు 7 సీటర్ తో ఉండే లగ్జరీ SUV ఇది.ఇక తాను కొనుగోలు చేసిన ఈ కారుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
ఇలా కీర్తి సురేష్ తన కారుకు పూజా కార్యక్రమాలు చేసినటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.ఇది చూసిన అభిమానులు కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఈమె తదుపరి సినిమాల విషయానికి వస్తే కీర్తి సురేష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు నటించే అవకాశాన్ని అందుకున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్నటువంటి భోళాశంకర్ సినిమాలు చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.