రాజకీయం కోసమే కొందరు పనికట్టుకుని విమర్శలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.ఎంసీహెచ్ఆర్సీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం అవార్డులు ఇస్తుంది.బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని అన్నారు.
పల్లెప్రగతి, పట్టణ ప్రగతిలో పలు రాష్ట్రాలకు తెలంగాణ దిక్సూచి అని తెలిపారు.స్వచ్ఛ సర్వేక్షణ్ లో అవార్డులు పొందిన 19 మున్సిపాలిటీలకు రూ.2 కోట్లు చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేశారు.దేశంలో మనకంటే మెరుగ్గా మున్సిపాలిటీలు ఎక్కడా లేవని వెల్లడించారు.