ఈనెల 5న యథావిధిగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరగనుంది.జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో ఎల్లుండి మీటింగ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక షెడ్యూల్ తో సంబంధం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.తెలంగాణభవన్ లో యథావిధిగా ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది.
ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కానుండగా.జాతీయ పార్టీగా మార్పుపై టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తీర్మానం చేయనుంది.అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు.