తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రభాస్ కి ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో కూడా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు.బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమాలు చేయడానికి బాలీవుడ్,కోలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆసక్తిని కనపరుస్తున్నారు.
ఇకపోతే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆదిపురుష్ సినిమా నుంచి భారీ అప్డేట్ విడుదల చేసింది చిత్ర బృందం.
ఎట్టకేలకు అభిమానాన్ని నిరీక్షణకు ఫలితం దక్కింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ టీజర్ ను విడుదల చేసిన గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వ్యూస్ ని దక్కించుకుంది.ఆదిపురుష్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
కాగా ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ లోనూ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే హిందీలో తన పాత్రకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పలేదు అన్న విషయం తెలిసిందే.నటుడు శరద్ కేల్కర్ ఆదిపురుష్ లో ప్రబాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు.గతంలో కూడా బాహుబలి చిత్రం సమయం లోనూ డార్లింగ్ పాత్రకు శరద్ నే వాయిస్ ఓవర్ అందించారు.
కాగా రామాయణం ఇతిహాసం ఆధారంగా రాబోతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా,కృతి సనన్ సీతగా,సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు.తాజాగా విడుదల అయినా టీజర్ లో భూమి కుంగినా.నింగి చీలినా.న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం.
వస్తున్నా.న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచి వేయడానికి.
ఆగమనం.అధర్మ విధ్వంసం.అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.