దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా హత్య కేసు నిందితుల్లో ఒకరైన దీపక్ పంజాబ్ మాన్సా జిల్లా పోలీసులు నుంచి తప్పించుకున్నాడని సమాచారం.మన్సా పోలీసులు మరో కేసులో గోయింద్వాల్ సాహిబ్ జైల్ నుంచి ప్రొడక్షన్ వారంటీ పై తీసుకొని వస్తుండగా తప్పించుకున్నాడని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
దీపక్ టినుని పట్టుకొనేందుకు గాలింపు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.మే 29న పంజాబ్ లోని మన్సా జిల్లాలో సిద్దూను కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో చార్జిషీట్ వేసిన 24 మంది నిందితుల్లో దీపక్ కూడా ఉన్నాడు.