అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎపిక్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’.ఈ సినిమా మన ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించు కున్నారు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.ఈ సినిమా తర్వాత వీరి లైనప్ కూడా పాన్ ఇండియా టార్గెట్ గానే జరుగుతుంది.
ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు నాలుగేళ్ళ పాటు నిరీక్షించారు.మరి అన్ని అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
బాక్సాఫీస్ కలెక్షన్ల ను కొల్లగొట్టింది.
ఇక ఈ సినిమా ఇక్కడే కాదు.
వరల్డ్ వైడ్ గా కూడా మంచి హిట్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగు వర్షన్ ను రాజమౌళి సమక్షంలో లాస్ ఏజెంల్స్ లో బిగ్గెస్ట్ స్క్రీన్ పై స్పెషల్ స్క్రీనింగ్ వేయగా దాదాపు 900 మందికి పైగానే విదేశీ ఆడియెన్స్ తో కలిపి ప్లాన్ చేసిన గ్రాండ్ షో చుసిన తర్వాత రాజమౌళిపై ప్రశంసల వెల్లువ కొనసాగుతుంది.
అలాగే రాజమౌళిపై చాలా విజువల్స్ కూడా కొనసాగుతుండగా అవి కాస్త వైరల్ అయ్యాయి.ఇక తాజాగా రాజమౌళి హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టాడు.
తన డైరెక్టర్ పట్ల గర్వం వ్యక్తం చేస్తూ మా వన్ వన్ ఓన్లీ రాజమౌలి అంటూ పోస్ట్ చేసి తన డైరెక్టర్ పై అభిమానాన్ని పంచుకున్నాడు.ఎలాగైతేనేం మరోసారి మన జక్కన్న పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగి పోతుంది.