కూకట్పల్లి తదితర ఆంధ్రా ప్రాబల్య ప్రాంతాల్లో కమ్మ సామాజికవర్గం బలంగా ఉండడంతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన పునాది ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.ఆ సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకుని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా ప్రయత్నిస్తోందని కూడా చెబుతున్నారు.
స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేయడాన్ని రాజకీయ పరిశీలకులు ఉదాహరణగా పేర్కొంటున్నారు.ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిసినా, టీఆర్ఎస్ శాసనసభ్యులు ఇలా కొరడం అందరీని ఆశ్చర్యపరించింది.
ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్స్లో సీఎం కేసీఆర్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మధ్య పోలిక పెల్లుబుకుతోంది.గతంలో మహాత్మాగాంధీ చెప్పినట్లుగా గ్రామస్వరాజ్యం కోసం పని చేసింది ఎన్టీఆర్ అని, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అని పోస్టర్లో రాసింది.
కేసీఆర్ను దేశ్కీ నేత అని కూడా ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.టీడీపీ విధేయులు, మద్దతుదారులను తమవైపుకు తీసుకునేందుకు అధికార టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న చర్చకు వైరల్ ఫ్లెక్సీలు ఆజ్యం పోశాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో ఆంధ్రా ఓటర్లు బీజేపీని కాదని గతంలో టీఆర్ఎస్కు పట్టం కట్టిన సంగతి తెలిసిందే.

సెటిలర్లుగా పిలుచుకునే ఆంధ్రా ఓటర్లు టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే అధికార పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకోవడం ఖాయమని.పెద్ద ఇబ్బందికరమని వారి భావిస్తున్నారు.GHMC ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానానికి చేరుకోవడానికి ఆంధ్రా ఓటర్లే కారణమని అందుకే బీజేపీ నేతల దూకుడుగా కారణమైందని భావిస్తున్నారు.
అప్పటి నుంచి సెటిలర్లను తమ వైపునకు తీసుకెళ్లడంపైనే టీఆర్ఎస్ దృష్టి సారించిందనీ, ఆ ప్రయత్నాల్లో భాగంగానే కొత్త ఫ్లెక్సీలు వెలువరించినట్లు తెలుస్తోంది.మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.







