తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే స్థానిక విద్యార్థులకు అవకాశాలు పెరుగుతున్నాయి.రాష్ట్ర విద్యార్థులకే మెజార్టీ సీట్లు లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధనలను వైద్యారోగ్య శాఖ సవరించింది.దీంతో వెయ్యికి పైగా ఎంబీబీఎస్ బీ-కేటరిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.
బీ కేటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్ కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.అదేవిధంగా ఓపెన్ కోటా 15 శాతం మాత్రమేనని వెల్లడించారు.







