Fashion show పట్టువస్త్రాలు, పసిడి కాంతుల్లో పడుచు అమ్మాయిలు మురిసిపోయారు.ర్యాంప్పై తన వయ్యారి హంసనడుకలతో ఆకట్టుకున్నారు.
రాబోయే పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని ఓ బంగారు ఆభరణాల సంస్థ సరికొత్త ఆభరణాలను తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని మారిగోల్డ్ హోటల్లో ఆభరణాలను పరిచయం చేస్తూ ప్రత్యేక ఫ్యాషన్ షోను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో సినీ కథానాయికలు అనుప్రియా, స్రవంతి, ప్రీతి సుందర్తో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు.తమ వినియోగదారుల కోసం సరికొత్త బంగారు ఆభరణాలను అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు మానెపల్లి జ్యూయలరీ డైరెక్టర్ గోపికృష్ణ తెలిపారు.







