1990 ల్లో సినీ ప్రేక్షకులు అందరికీ కూడా అభిమాన హీరోయిన్ అంటే ఐశ్వర్యారాయ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.అందం మరియు ఆమె యొక్క బాడీ లాంగ్వేజ్ నటన ఇలా ప్రతి ఒక్కటి కూడా దేశంలోని యువతకి మత్తెక్కించేవి అనడంలో సందేహం అసలే లేదు.
కానీ పరిస్థితి మారింది.కాల చక్రం తిరుగుతున్న కొద్ది ఆమె అందం తరిగిపోయిందా అన్నట్లుగా మారి పోతుంది.
సాధారణంగా కొంత మంది హీరోయిన్స్ వయసు పెరుగుతున్నా కూడా అందం తగ్గకుండా అలాగే ఉంటారు.ఐశ్వర్య రాయ్ కూడా ఇన్నాళ్లు అలాగే అనిపించింది.
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మారినట్లుగా అనిపిస్తుంది.తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పోనియన్ సెల్వన్ సినిమా లో ఐశ్వర్య రాయ్ కీలక పాత్ర లో నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఐశ్వర్య రాయ్ పాల్గొన్నారు.ఆ సందర్భం గా ఆమె ను చూసిన అభిమానులు కొందరు ఈమె సినిమా లకు గుడ్ బై చెప్పే సమయం వచ్చిందా అంటూ చర్చించుకుంటున్నారు.ఎందుకంటే ఆమె ఫేసులో మునుపటి అందం కనిపించడం లేదు.ఆమె బాడీ లాంగ్వేజ్ లో మునుపటి హోయలు లేవు, ఆమె సినిమా లకు దూరమయ్యే రోజులు వచ్చాయని.
గతంలో తన అందం నీ అభిమానించిన వారికి ఈ అందం చూపించకుండా సినిమా లకు దూరం గా ఉంటే మంచిది అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్ ఈ మధ్య కాలం లో తక్కువ సినిమాలే చేస్తున్నారు.
ముందు ముందు ఆ సినిమా లు కూడా చేయకుండా ఉండాలని కొందరి విజ్ఞప్తి చేస్తున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఆంటీ.అత్తమ్మ పాత్రలు చేయకుండా ఐశ్వర్య రాయ్ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేయాలంటూ చాలా మంది కోరుకుంటున్నారు.మరి ఐశ్వర్యారాయ్ అభిప్రాయం ఏంటో అనేది చూడాలి.







