భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది.ఆఫ్ లైన్ టికెట్స్ అయిపోయాయని అధికారులు తెలిపారు.
ఆఫ్ లైన్ లో సుమారు మూడు వేల టికెట్ల అమ్మకం జరిగినట్లు తెలుస్తోంది.ఆన్ లైన్ బుకింగ్ రాత్రి 7.30 గంటలకు బుకింగ్ ఓపెన్ అవుతుందని ప్రకటించారు.వేలాది మంది వస్తే కేవలం మూడు వేల టికెట్లు అమ్మి హెచ్ సీఏ మోసం చేసిందని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.