చందు మొండిటి దర్శకత్వంలో హీరో నిఖిల్ కలర్స్ స్వాతి జంటగా నటించిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఆగస్టు 5వ తేదీ విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా 100 కోట్లను రాబట్టడంతో సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
శ్రీకృష్ణుడు జన్మస్థానమైన ద్వారకలో దాగి ఉన్న రహస్యాలను బయట పెడుతూ దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
ఇక ఈ సినిమా కేవలం సౌత్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా నార్త్ ప్రేక్షకులను సైతం ఎంతో ఆకట్టుకుందని చెప్పాలి.ఇదిలా ఉండగా ఈ సినిమాని మలయాళ వెర్షన్ లో కూడా విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ క్రమంలోనే హీరో నిఖిల్ సైతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో కార్తికేయ 3 పై అభిమానులు ఎంతో ఆతృత కనబరుస్తున్నారు.కార్తికేయ 3 సినిమా కూడా ఉండబోతుందా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలిగింది.ఈ క్రమంలోనే ఈ విషయంపై హీరో నిఖిల్ స్పందిస్తూ కార్తికేయ 3తప్పనిసరిగా ఉంటుందని, కార్తికేయ 2 సినిమాని మించి ఈ సినిమా ఉండబోతుందని త్వరలోనే ఈ విషయాల గురించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా నిఖిల్ వెల్లడించారు.
ఇక మలయాళ వెర్షన్ లో కార్తికేయ2 సెప్టెంబర్ 23వ తేదీ విడుదల కానుంది.