ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే సరైన వ్యక్తి: వీహెచ్

ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే సరైన వ్యక్తి అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.

రాహుల్ పగ్గాలు చేపడితే కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందన్నారు.బీజేపీని సమర్ధంగా ఎదుర్కొనే వ్యక్తి కేవలం రాహుల్ మాత్రమేనని వ్యాఖ్యనించారు.

ఈ విషయంపై ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే వ్యక్తులు ఆలోచించుకోవాలని సూచించారు.కాంగ్రెస్ కు కొత్త వారు వస్తే ఎవరూ గుర్తుపట్టలేరని పేర్కొన్నారు.

దేశంలో ఎవరూ చేయని విధంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని వీహెచ్ కొనియాడారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు