నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అప్రమత్తమైన అధికారులు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,40,794 క్యూసెక్కులుగా కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు.అదేవిధంగా డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.
ప్రస్తుతం 588 అడుగులుగా ఉంది.ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా.
ప్రస్తుతం 308 టీఎంసీలుగా ఉంది.







