ఇటీవల అమరావతి “మహా పాదయాత్ర” రెండో విడత స్టార్ట్ చేయడం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని .
అమరావతి నుండి అరసవల్లి వరకు ఈ పాదయాత్ర సాగుతోంది.ఈ క్రమంలో వైసిపి పార్టీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి పాదయాత్రలో అసలు రైతులు ఉన్నారా అని ప్రశ్నించారు.ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
పాదయాత్ర పేరుతో జరుగుతున్న దండయాత్రలు అని అభివర్ణించారు.విశాఖను పరిపాలన రాజధాని కాకుండా చేస్తున్న ఈ పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు తిప్పి కొడతారని అన్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే అమరావతి రాజధానిగా చేయాలని పాదయాత్ర చేస్తున్నట్లు వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పాదయాత్రలో అమరావతి జేఏసీ సభ్యులతోపాటు.
రైతులు పాల్గొన్నారు.దాదాపు 900 కిలోమీటర్ల మేరకు సాగనున్న ఈ పాదయాత్రలో 12 పార్లమెంటు మరియు 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగనుంది.







