ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 5,16,740 ట్యాబ్లను అందజేయనుంది.నాణ్యమైన ట్యాబ్ల కొనుగోళ్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, గ్రామ దవాఖానలు, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ సౌకర్యాలతో కూడిన స్మార్ట్ టీవీలను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు.మొదటి దశలో 72,481 స్మార్ట్ టీవీలు అవసరమని, దీనివల్ల ఖజానాకు రూ.512 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
నాణ్యతతో పాటు గ్యారెంటీతో కూడిన ట్యాబ్లు, స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచించారు.నాడు -నేడు కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన పాఠశాలలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని అధికారులకు చెప్పారు.
పాఠశాలల్లో మౌలిక వసతులు సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు.తరగతి గదిలోని ట్యాబ్లు, స్మార్ట్ టీవీలను ఉపయోగించి బైజస్ సిబ్బంది విద్యార్థులు మరియు సిబ్బందితో ఇంటరాక్ట్ అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.
నాణ్యమైన ట్యాబ్ల కొనుగోళ్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, గ్రామ దవాఖానలు, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని జగన్ చెప్పారు.

బైజస్లు కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బోధన, అభ్యాసన సామగ్రిని చేరవేస్తామని అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలియజేశారు.ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించినప్పటికీ వాటిని సక్రమంగా నిర్వహించకపోతే నాణ్యత కోల్పోతాయి.నాడు-నేడు కింద ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించిన చోట అధికారులు ఎంత వరకు నాణ్యతను కాపాడుతున్నారో చూడాల్సిందే మరి .







