సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు.ఈమె ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.సమంత పెళ్ళికి ముందు ఎలా వరుస సినిమాలు చేసిందో ఇప్పుడు విడాకుల తర్వాత అదే జోరు కొనసాగిస్తుంది.
చెప్పాలంటే ఇంతకు ముందు కంటే డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ ఎవ్వరు ఎన్ని విమర్శలు చేసిన పట్టించు కోకుండా దూసుకు పోతుంది.
అయితే సమంత సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటూ వస్తుంది.
అసలు సామ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఏదొక అప్డేట్ ఇస్తూనే ఉంటుంది.కానీ ఈమె ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడం అందరికి ఆశ్చర్య కలిగిస్తుంది.
మరి ఈమెకు ఎంతో ఇష్టమైన సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటుంది అనేది ఎవ్వరికి అర్ధం కాకుండా ఉంది.
ఈమె ఇలా దూరంగా ఉండడంతో ఫ్యాన్స్ అంత సమంత సోషల్ మీడియాను డీటాక్స్ అని పిలుస్తున్నారు.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.

ఈమె ప్రెజెంట్ తనని తాను కొత్తగా నిరూపించు కోవడానికి సిద్ధం అవుతుంది.తన శక్తినే తన పెట్టుబడిగా పెట్టి ఎదగాలని పరితపిస్తుంది.అందుకే ఈమె సోషల్ మీడియా డీటాక్స్ లో ఉందట.
ప్రెజెంట్ సమంత మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటుంది.రస్సో బ్రదర్స్ సిటాడెల్ లో తన రోల్ కోసం ఈమె చాలానే కష్టపడుతుంది.ఇలా ఈమె తన కెరీర్ కోసం కష్టపడుతుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే వరకు సోషల్ మీడియాను టచ్ చేయదు అని అంటున్నారు.
చూడాలి సామ్ ఎన్నాళ్ళు సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందో.







