సీడబ్ల్యూసీ భేటీలో ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై చర్చించిన నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.దీనిలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు.
సెప్టెంబర్ 22న ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు.అక్టోబర్ ఒకటిన నామినేషన్ల పరిశీలన ఉంటుంది.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8 కాగా, అక్టోబర్ 17న ఎన్నికలు జరుగనున్నాయి.అక్టోబర్ 19న కౌంటింగ్… అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారని ఆ పార్టీ నేతలు వేణుగోపాల్, మధుసూదన్ మిస్త్రీ, జైరాం రమేశ్ వెల్లడించారు.