టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే కలిసిన నటించిన తాజా చిత్రం లైగర్.ఈ సినిమా తాజాగా ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.సినిమాకు విడుదల మందు అభిమానులు, చిత్ర బృందం ఆర్ఆర్ఆర్ సినిమా రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.
అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లో వర్షం కురిపిస్తుంది అని కూడా భావించారు.
కానీ ఈ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ టాప్ తెచ్చుకోవడంతో అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.అలాగే చార్మి నిర్మాతగా వ్యవహరించింది.కాగా ఇందులో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో సీనియర్ నటి,స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించిన విషయం తెలిసిందే.అయితే పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాలో నటీనటుల రెమ్యూనరేషన్ విషయం గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

కాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సీనియర్ నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్ ల పారితోషికం విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమాకు గాను హీరో విజయ్ దేవరకొండ 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించిన సీనియర్ నటి రమ్యకృష్ణ కోటి రూపాయలు తీసుకోగా, కోచ్గా కనిపించిన రోనిత్ రాయ్ రూ.1.5 కోట్లు తీసుకున్నాడట.బాలీవుడ్ బ్యూటీ అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ అనన్య పాండే మూడు కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకుందట.ఇక సినిమాకు హైలెట్ రోల్గా మొదటి నుంచి పేరు తెచ్చుకు మైక్ టైసన్ విజయ్ కంటే ఎక్కువగా రూ.40 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది.







