1.ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని ఖండించిన ఎన్నారై టిఆర్ఎస్

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బిజెపి శ్రేణులు దాడికి పాల్పడడాన్ని ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది.
2.వరదల్లో గల్లంతైన భారతీయ మహిళ మృతి

అమెరికాలోని యూటా రాష్ట్రంలో స్నేహితుల తో సరదాగా పార్క్ కు వెళ్ళిన భారత్ కు చెందిన జీతల్ అగ్ని హోత్రి అనే యువతి అక్కడ సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకుని మృతి చెందారు.
3.ఇండియా టుడే పెరేడ్ లో నాట్స్

అజాదకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా న్యూయార్క్ నగరంలో జరిగిన 75 వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ‘ నాట్స్ ‘ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా న్యూయార్క్ నగర వీధుల్లో జై భారత్ నినాదాలు చేస్తూ సందడి చేశారు.
4.డ్రైవర్లుగా పనిచేస్తున్న ప్రవాసులకు గమనిక
కువైట్ లో టాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్న ప్రవాసులు, నివాసితుల కు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక సూచనలు చేస్తూ 8 కొత్త నిభందనలు విధించింది.
5.రాజాసింగ్ పై పాకిస్థాన్ ఫైర్

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే పై రాజాసింగ్ మహ్మద్ ప్రవక్త పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పాకిస్థాన్ స్పందించింది.రాజాసింగ్ వ్యాఖ్యలు ముస్లిం ల మనోభావాలు దెబ్బతిసే విధంగా ఉన్నాయని ఖండించింది.ఇప్పటికే బిజెపి ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాజాశింగ్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
6.మలేషియ మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలు శిక్ష

మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ కు 12 ఏళ్ల జైలు శిక్ష ఖరారైయ్యింది.
7.ఉక్రెయిన్ ప్రధాని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం
రష్యా దాడులతో ఉక్రెయిన్ మళ్లీ పుట్టింది అంటూ ఉక్రెయిన్ ప్రధాని జెలెన్ స్కీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రసంగించారు.ఇప్పటికే రష్యా దాడులతో ఉక్రెయిన్ కుదేలు అవ్వగా , ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.







