ఏపీలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన కొనసాగుతోంది.దీనిలో భాగంగా రేపు విజయవాడకు రానున్నారు.
ఈ నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టుల భవన ప్రాంగణంలో నూతనంగా బహుళ అంతస్తులతో కూడిన భవన సముదాయాన్ని సీఎం జగన్ తో కలిసి ప్రారంభించనున్నారు.అయితే, ప్రస్తుతం తిరుపతిలో పర్యటిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం మహాత్మాగాంధీపై రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
రాత్రి తిరుపతిలోనే బస చేయనున్న ఆయన.రేపు విజయవాడకు బయలుదేరనున్నారు.