ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణికుల విమానం భారత్కు రానుంది.అందులోనూ టెక్ సిటీగా పేరొందిన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనుంది.
అక్టోబర్ 30న ఈ పెద్ద విమానం వస్తుండడంతో విమాన ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఓ సారి ఈ విమానం ముంబై వచ్చింది.
ఇక బెంగళూరు నుంచి సేవలను అందించనుంది.అక్టోబర్ నుంచి ఈ డబుల్ డెక్కర్ విమానం బెంగళూరు-దుబాయ్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించనుంది.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్బస్ ఏ 380 అని చాలా మందికి తెలుసు.
ఈ సూపర్ జంబో విమానం పలు సార్లు విజయవంతంగా తన సేవలు అందించింది.ఇక అక్టోబర్ 30వ తేదీ నుంచి దక్షిణ భారతదేశంలోని బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇది రానుంది.
ఈ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB) హబ్లో 21:25కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 02:30కి బెంగళూరులో ల్యాండ్ అవుతుంది.రెండు గంటల టర్నరౌండ్ తర్వాత, ఈ ఏ380 విమానం 04:30కి ఆకాశంలోకి తిరిగి వెళ్లిపోతుంది.దాని షెడ్యూల్ దుబాయ్కి 07:10కి చేరుకుంటుంది.ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్బస్ ఏ380 ఫ్లీట్ యొక్క ఆపరేటర్గా ఉంది.
ఎమిరేట్స్ సూపర్జంబో విషయానికి వస్తే అనేక విభిన్న సీటింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది.ఇందులో సెకండ్ క్లాస్ సీట్లు అధికంగా ఉంటాయి.600ల మంది ప్రయాణికులకు అవసరమైన సెకండ్ క్లాస్ సీట్లు ఇందులో ఉన్నాయి.ప్రీమియం ఎకానమీ క్యాబిన్ సీట్లు కూడా అధికంగానే ఉన్నాయి.
ఎమిరేట్స్ ఏ380 విమానంలో 14 ఫస్ట్ క్లాస్ సూట్లు, 76 బిజినెస్ క్లాస్ ఫ్లాట్బెడ్లను కలిగి ఉంటాయి.







