అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది.ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కల నెరవేరింది.
ఎంతగానే ఎదురు చూసిన వారి ఎదురు చూపులు ఇన్నాళ్లకు ఫలించాయి.అసలు విషయం లోకి వెళ్తే.
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట‘ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.
మహేష్ బాబు తన 28వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు.
త్రివిక్రమ్ అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు.ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.
దీంతో ఇప్పుడు చేసే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.ఈ సినిమా షూటింగ్ ఆగష్టు లో స్టార్ట్ చేస్తాము అని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.
మరి మేకర్స్ ప్రకటించినట్టు గానే ఈ రోజు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.ఈ విషయాన్నీ స్వయంగా మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

మహేష్ బాబు షూట్ లో పాల్గొన్న ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయం చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఎట్టకేలకు షూటింగ్ స్టార్ట్ అవ్వడంతో ఇక బ్రేక్ ఉండదు అని భావిస్తున్నారు.ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా. హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.







