భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది.దీంతో వరద ముప్పు తప్పదనే సంకేతాలు కన్పిస్తున్నాయి.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరింది.
అప్రమత్తమైన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.అయితే రాత్రి కల్లా నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉండటంతో ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇటీవల వచ్చిన భారీ వరదల ప్రభావం నుండి బయట పడకముందే మళ్లీ వరద ముప్పు పొంచి ఉండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.