ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కడమే కాకుండా నటీనటుల రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరగడంతో నిర్మాతలందరూ సినిమా షూటింగు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి సినిమా షూటింగ్ లు బంద్ అయ్యాయి.
ఇకపోతే ఈ విధంగా సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చినప్పటికీ మెల్లిమెల్లిగా కొన్ని సినిమా షూటింగులు తిరిగి ప్రారంభం కాగా కొన్ని సినిమాలు మాత్రం ఇప్పటికీ షూటింగ్ పనులను మొదలు పెట్టలేదు.
ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సమ్మె కారణంగా ప్రభాస్ నటించినటువంటి రెండు సినిమా షూటింగులు కూడా ఆగిపోయాయి.
ఈయన ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, సలార్ వంటి సినిమాలలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమా కోసం భారీ ఖర్చు చేసి సెట్ నిర్మించారని ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సరికొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో సమ్మె కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ఇలా ఈ రెండు సినిమాలు వాయిదా పడటంతో సుమారు 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని సమాచారం.
ఇలా ఈ రెండు సినిమా షూటింగులు క్యాన్సిల్ కావడం వల్ల ప్రభాస్ కి కూడా భారీగా నష్టం వచ్చిందని ఈయన కూడా కోట్ల రూపాయలు నష్టపోయారని సమాచారం.ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలకు ఇచ్చిన డేట్స్ వేస్ట్ కావడంతో ప్రభాస్ కి కూడా సుమారు 5 నుంచి 6 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది.అయితే ఈ సమ్మె పూర్తిగా ఎప్పుడు తొలగిపోతుంది తిరిగి ఎప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు షూటింగ్ లు ప్రారంభమవుతాయో తెలియదు కానీ ఇలా షూటింగ్ బంద్ చేయడం వల్ల పెద్ద ఎత్తున కార్మికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.